Header Banner

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు... 30 నుంచి 40 మంది హీరోలు మాత్రమే ఉన్నారు!

  Sat Jun 07, 2025 22:07        Cinemas

150 కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రేక్షకులను అలరించేందుకు 30 నుంచి 40 మంది హీరోలు మాత్రమే ఉన్నారని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడు సునీల్ నారంగ్ అన్నారు. హీరోలు దేవుళ్లు లాంటి వారని, వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాతలు చేయరని వ్యాఖ్యానించారు. అగ్ర కథానాయకుడు పవన్ కల్యాణ్ తుపానులాంటి వారని, ఆయన సినిమాను ఆపే అధికారం ఎవరికి లేదన్నారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యవర్గానికి మూడోసారి అధ్యక్షుడిగా సునీల్ నారంగ్, కార్యదర్శిగా శ్రీధర్ను సభ్యులు ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు పలువురు నిర్మాతలు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సన్మానించి అభినందనలు తెలిపారు. ఇటీవల థియేటర్ల బంద్ అంశాన్ని ఇద్దరు దర్శకులు, మరో ఇద్దరు నిర్మాతలు వివాదంగా మార్చారని, త్వరలోనే వారి పేర్లను బయటపెట్టి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. ఒక్కో హీరో రెండేళ్లకో సినిమా చేయడం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సికింద్రాబాద్ లో ఆరు థియేటర్లు మూతపడ్డాయని వెల్లడించారు. జనవరి నుంచి మూడు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయని, పవన్ కల్యాణ్ సినిమా కోసం థియేటర్లను ఖాళీగా ఉంచితే ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడిందని వాపోయారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

 ఇది కూడా చదవండి : రేపే ఆదివారం ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి.. ఈ చేపను తినడం వల్ల మీ రక్తంలో చక్కెర ఇట్టే తగ్గిపోతుంది!

 

"ఈ ఏడాది ఇప్పటివరకూ 'సంక్రాంతి వస్తున్నాం', 'మ్యాడ్ స్క్వేర్', 'కోర్టు' చిత్రాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇలాగైతే మేం ఎలా బతకాలి. అనవసరంగా సింగిల్ స్క్రీన్లను బదనాం చేస్తున్నారు. హీరోలకు స్టార్ హోదా ఎక్కడి నుంచి వచ్చింది. ఒకప్పుడు హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేవాళ్లు. ఇప్పుడు ఒక్కో హీరో ఏడాదికి ఒక్క సినిమా కూడా చేయడం లేదు. రూ.10 లక్షలు తీసుకునే ఒక హీరోకి తదుపరి సినిమాకి రూ.30 లక్షలు ఇస్తున్నారు. ఇటీవల విడుదలైన ఒక సినిమా డిజాస్టర్ అయితే, ఆ హీరోని పిలిచి రూ.13 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు. థియేటర్లు మా ఆస్తులు, మేము ఏమైనా చేసుకుంటాం. హీరోలు రెండేళ్లకు ఒక సినిమా చేస్తే థియేటర్లు ఎలా నడుస్తాయి. థియేటర్లు ఉన్నవాళ్లమంతా ఒకే రూఫ్ కిందకు వచ్చాం. మా గ్రూపును చూసి ఎగ్జిబిటర్ వస్తే నాలుగు డబ్బులు దొరుకుతాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లను మల్టీప్లెక్స్ తరహాలోనే నిర్వహణ చేసుకుంటున్నాం. ప్రేక్షకుడికి తక్కువ ధరతో పాటు, 80 రూపాయల్లోనే పాప్ కార్న్, 30 రూపాయలకే కూల్డ్రింక్ అందిస్తున్నాం” అని శ్రీధర్ తెలిపారు. థియేటర్ల బంద్పై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తరపున ఎలాంటి ప్రకటన చేయలేదని, అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు ఎలాంటి లేఖ రాయలేదని ఆయన స్పష్టం చేశారు.

 

ఇది కూడా చదవండి: ఏపీకి వస్తోన్న గూగుల్.. అక్కడ 143 ఎకరాల్లో ఏర్పాటు.. ఆ ప్రాంతానికి మహర్దశ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారుదరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లుఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #telangana #cinema #movie #statefilme #chamber